ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల బ‌డ్జెట్‌... వామ్మో!

పిఠాపురంలో పోటీ చేస్తున్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల బ‌డ్జెట్‌పై సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చార‌మే నిజ‌మైతే... వామ్మో, అంత భారీ మొత్త‌మా? అని ప్ర‌తి ఒక్క‌రూ నోరెళ్ల‌బెట్టాల్సిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ గురించి భారీ డైలాగ్‌లు కొట్టారు. అలాంటి నాయ‌కుడు చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టిన త‌ర్వాత‌... డ‌బ్బు లేనిదే టికెట్ ఇవ్వ‌న‌ని తేల్చేశారు.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఎన్నిక‌ల ఖ‌ర్చు, ఇత‌ర‌త్రా గురించి ప్ర‌చార‌మ‌వుతున్న విష‌యాల గురించి తెలుసుకుందాం. ఈ ద‌ఫా ఎమ్మెల్యే కాక‌పోతే, ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్టే. అందుకే ఎలాగైనా ఎమ్మెల్యే అయ్యేందుకు ప‌వ‌న్ అక్ష‌రాలా రూ.100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో మెగా హీరోల స్పెషల్ ఫ్లైట్ల‌ ఖర్చులు, జబర్దస్త్ ఆర్టిస్ట్స్‌ స్పెషల్‌ ఫ్లైట్‌తో పాటు వారి కాల్ షీట్ల ఖ‌ర్చే రూ.20 కోట్లకు పైగా అవుతోంద‌ని ప్ర‌చారం. ఈ ఖర్చులో మెజారిటీ సొమ్మును ప‌వ‌న్ నిర్మాత‌లు, చంద్రబాబునాయుడు భరిస్తున్నార‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

ఇక్క‌డ మ‌రో కీల‌క అంశం. పిఠాపురంలో ప‌వ‌న్‌ను గెలిపించే బాధ్య‌త‌ను భుజాన మోస్తున్న టీడీపీ కీలక నేతకి రోజుకు రెండు కోట్లకు పైగా చెల్లిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని పిఠాపురం కూట‌మి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చ‌ర్చిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే ఇంత పెద్ద‌మొత్తంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నా, గెలుపుపై ఇంకా న‌మ్మ‌కం రాక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Readmore!

Show comments

Related Stories :