ప‌వ‌న్‌ను.. ముద్ర‌గ‌డ అంత‌గా తిట్టాడేంటి!

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య డైలాగ్ ఓ రేంజ్‌లో సాగుతోంది. కాకినాడ‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ మాట్లాడుతూ ముద్ర‌గ‌డను, ఆయ‌న కుమార్తె క్రాంతిని క‌లుపుతానే త‌ప్ప‌, విడ‌దీయ‌న‌ని అన్నారు. ప‌వ‌న్ మాట‌ల‌కు ముద్ర‌గ‌డ ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు. ఒక మాట‌లో చెప్పాలంటే కాస్త హ‌ద్దులు దాటాడ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీ మెగా ఫ్యామిలీ గురించి కూడా చెప్పు అని ముద్ర‌గ‌డ అన్నారు. మీ కుటుంబంలో ప్రేమ వివాహాలు ఎవ‌రు చేసుకున్నారు, తాగి తంద‌నాలు ఎవరు ఆడుతున్నారో చెప్పాల‌ని ముద్ర‌గ‌డ డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌టితో ముద్ర‌గ‌డ ఆగ‌లేదు. ఎవ‌రు ఎవ‌రితో వుంటున్నారో చెప్పాల‌ని ఆయ‌న కోరారు. అలాగే మీ ముగ్గురి భార్య‌ల గురించి కూడా చెప్పు అంటూ స‌వాల్ విసిరారు.

అలాగే త‌న కుటుంబంలో ఎవ‌రికి ఏమైనా త‌న కూతురిని పంపొద్ద‌ని ముద్ర‌గ‌డ విజ్ఞ‌ప్తి చేశారు. కూతురితో త‌న‌కు తెగ‌దెంపులు చేశార‌ని ఆయ‌న వాపోయారు. అందుకే చాలా రిలీఫ్‌గా వుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న కూతురు కూడా ఎప్పుడూ పుట్టింటికి వ‌స్తాన‌ని అనొద్ద‌ని ఆయ‌న కోరారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీటుకే దిక్కులేద‌ని, అలాంటిది త‌న కుమార్తెకు సీటు ఇస్తాన‌న‌డం ఖ‌ర్మ అంటూ ముద్ర‌గ‌డ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

త‌మ బ‌తుకులు బ‌త‌క‌నివ్వాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. కులాలు, కుటుంబాల మ‌ధ్య చిచ్చుపెట్టాల‌ని మీ గురువు చెప్పారా? అని ప‌రోక్షంగా చంద్ర‌బాబు గురించి ప్ర‌స్తావించారు. అలాగే ముద్ర‌గ‌డ కుమార్తెగా ఎందుకు ప‌రిచ‌యం చేశావా? నీకు సిగ్గు లేదా? అని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ప‌వ‌న్‌పై ధ్వ‌జ‌మెత్తారు. నువ్వు వ‌దిలేసిన భార్య‌ల్ని, ఇప్పుడున్న భార్య‌ని కూడా ప‌రిచ‌యం చేయ్ అని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌న‌కు వ్య‌తిరేకంగా కుమార్తెతో మాట్లాడించార‌నే ఆవేద‌న‌... ముద్ర‌గ‌డ‌తో ప‌రిధి దాటి విమ‌ర్శ‌లు చేయించింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Readmore!

Show comments