పవన్ కల్యాణ్ పై పూనమ్ అస్త్రం..15 కోట్లు ఆఫర్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ను మరోసారి బద్నామ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే పవన్ వ్యక్తిగత విషయాలపైన నానా యాగీ చేస్తున్న ఓ వర్గం.. ఇప్పుడు ఏకంగా చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని అనుకుంటోంది ఆ అస్త్రం పేరు పూనమ్ కౌర్.

పవన్ వ్యక్తిగత జీవితంలో పూనమ్ కౌర్ ది 'ప్రత్యేకమైన' అధ్యాయం అంటారు కొందరు తెలిసినవాళ్లు. ఈ విషయంపై గతంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని ఓ వర్గం భావిస్తోందట. ఈ మేరకు పూనమ్ కౌర్ తో వాళ్లు సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

తాము చెప్పిన టైమ్ కు పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఏకంగా 15 కోట్ల రూపాయలు ఇస్తామంటూ పూనమ్ కౌర్ వద్దకు ఓ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం ఆ వర్గం పవన్ పార్టీ జనసేనతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ పొత్తుయత్నాలు ఫలించకపోతే అప్పుడు పూనమ్ కౌర్ ను తెరపైకి తీసుకొచ్చే విధంగా చర్చలు సాగిస్తున్నారట.

అయితే పవన్ కల్యాణ్ పై స్పందించడానికి పూనమ్ మాత్రం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. సినిమాలకు దూరమై ప్రస్తుతం ఓ భారీ సీరియల్ లో నటిస్తున్న ఆమె, ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటోంది. 15 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ.. మరోసారి ఆ వివాదాన్ని తెరపైకి తీసుకురాకూడదని ఆమె గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల సమయానికి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

కెసియార్‌తో జగన్‌ చేతులు కలిపినది నిధుల కోసమా?

పవన్‌ను తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు

Show comments